తాళ్లరేవు, మహి న్యూస్, డిసెంబర్ 31.
కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నుంచి ఆంధ్రా ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న వెయ్యి లీటర్ల డీజిల్ను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు కోరంగి ఎస్ఐ పి. సత్యన్నారాయణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు గొల్లప్రోలు గ్రామానికి చెందిన వెన్న శ్రీను, కర్రి అశోక్ యానాంలోని ఒక పెట్రోలు బంకులో వెయ్యి లీటర్ల డీజిల్ను పీపాల్లో నింపుకుని వ్యానుపై తరలిస్తుండగా. పి.మల్లవరం చెక్పోస్టు వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. సరైన పత్రాలు లేకపోవడంతో డీజిల్ తోపాటు టాటావ్యానును స్వాధీనం చేసుకుని సీజ్ చేసారు. ఎవరైనా యానాం నుంచి పెట్రోల్, డీజిల్ను అక్రమంగా తరలిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు ఎస్ఐ సత్యన్నారాయణ తెలిపారు. ఈ దాడిలో కోరంగి పోలీసులు. రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

