Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: admin
తిరుమల, మహి న్యూస్, మార్చి 01: సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసత్య ఆరోపణలు, మార్ఫింగ్ వీడియోలపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తీవ్రంగా స్పందించారు. ఇదంతా వైసీపీ నేతలు పన్నిన నీచమైన కుట్ర అని ఆయన ధ్వజమెత్తారు. ఆదివారం తిరుమలలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, తన ప్రతిష్టను మరియు టీటీడీ బోర్డు గౌరవాన్ని దెబ్బతీసేందుకు చేస్తున్న ప్రయత్నాలను క్షుణ్ణంగా వివరించారు. డీప్ ఫేక్ వీడియోల వెనుక కుట్ర తనపై వస్తున్న వీడియోలు పూర్తిగా డీప్ ఫేక్ మరియు మార్ఫింగ్ అని చైర్మన్ స్పష్టం చేశారు. వీడియోలో ఉన్న వ్యక్తికి, తమ కుటుంబానికి 30 ఏళ్ల అనుబంధం ఉందని, ఆ సాన్నిహిత్యాన్ని ఆసరాగా చేసుకుని పాత ఫోటోలను మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని, దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రతీకార రాజకీయాలు గతంలో జగన్ మోహన్…
తిరుమల,మహి న్యూస్, ఫిబ్రవరి 28: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో మూడో రోజైన శనివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు తెప్పపై విహరించారు. ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. స్వామి, అమ్మవార్లు మూడుసార్లు విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, వేదపండితుల వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. తెప్పోత్సవాలలో భాగంగా స్వామి పుష్కరిణి చుట్టూ ఏర్పాటు చేసిన దశావతారాలు, పాండు రంగడు, శ్రీ పద్మావతి శ్రీనివాసుల రూపాలతో విద్యుద్దీపాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు మెంబర్లు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కడప, మహి న్యూస్ ఫిబ్రవరి 27 : పారిశ్రామిక వనరులు పుష్కలంగా ఉన్న కడప జిల్లాలో.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కడప కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో.. జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ (డీఐఇపీసీ) సమావేశం జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జేసీ డా. నిధి మీనామాట్లాడుతూ… జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసి.. పరిశ్రమల ద్వారా విస్తృత ఉపాధి అవకాశాలను కల్పించేందుకు అన్ని అనుబంధ శాఖలు సమన్వయంతో కృషి చేయాలన్నారు. జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి, ఔత్సహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందివ్వనున్నట్లు తెలిపారు. కొత్తగా పారిశ్రామిక రంగంలోకి అడుగిడాలనుకున్న వారికి ఆర్థిక ప్రాత్సాహాన్ని అందించేలా బ్యాంకర్లతో సమన్వయం చేయడం జరుగుతుందన్నారు. పరిశ్రమల ప్రమోషన్ కు…
తిరుమల, మహి న్యూస్ ఫిబ్రవరి 27: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో రెండో రోజు శుక్రవారం రాత్రి రుక్మిణీకృష్ణులు భక్తులకు అభయమిచ్చారు. . ముందుగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణీకృష్ణుల ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. రెండో రోజు స్వామి, అమ్మవారు మూడు చుట్లు తిరిగి భక్తులను అనుగ్రహించారు. మంగళవాయిద్యం, వేదపండితుల వేదఘోష, అన్నమాచార్య ప్రాజెక్టు సంకీర్తనల మధ్య తెప్పోత్సవం కనువిందుగా జరిగింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నత అధికారులు,పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు…
పులివెందుల, మహి న్యూస్, ఫిబ్రవరి 27 : ముద్దనూరు -గోరంట్ల వరకు వయా పులివెందుల మీద నిర్మిస్తున్న 716జి నేషనల్ హైవే రోడ్డు నిర్మాణాలకు సంబంధించి భూసేకరణ నిమిత్తమై ఆ భూములు కోల్పోతున్న ప్రజలతో పులివెందుల మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జాయింట్ కలెక్టర్ వస్తారని తొలుత ప్రకటించారు. కానీ జాయిన్ కలెక్టర్ హాజరు కాలేదు. అలాగే ఈ రోడ్డు నిర్మాణాల సందర్భంగా భూములు కోల్పోతున్న చాలామందికి సమాచారమే ఇవ్వలేదు. అయితే కొంతమంది సమాచారం తెలుసుకొని సమావేశానికి హాజరయ్యారు. పులివెందుల ఆర్డీవో చిన్నయ్య, తాసిల్దార్ లు సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి కీలకమైన మున్సిపల్ కమిషనర్ కూడా హాజరు కాలేదు. ఈ సమావేశానికి సంబంధిత హైవే అధికారులు కానీ ఆర్ అండ్ బి అధికారులు కానీ హాజరు కాలేదని బాధితులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా వారు ఏదో సమావేశాన్ని నిర్వహించామని వెల్లడించేసి చకచక కొన్ని వివరాలు పేపర్ ద్వారా…
రాజోలు, మహిన్యూస్, ఫిబ్రవరి 27 డాక్టర్.బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం రాజోలు మండలం,పొదలాడ గ్రామంలో రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ గొల్లపల్లి అమూల్య ఆధ్వర్యంలో జరిగిన తెలుగుదేశం పార్టీ శ్రేణుల సమావేశం,క్యాడర్ విత్ లీడర్ అనే కార్యక్రమంలో భాగంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ పంపిణీలో ముఖ్య అతిథులుగా టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి,జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు పాల్గొన్నారు. వీరితో పాటు గోదావరి సెంట్రల్ డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ గుబ్బల శ్రీనివాస్ హాజరైనారు.ఈ కార్యక్రమంలో కేతా వెంకట లక్ష్మి, భూపతి రాజు సాయిబాబా రాజు, ముదునూరి చిన్నబాబు రాజు, చిటికెల రామ్మోహన్ రావు, కడలి శ్రీ దుర్గ మోహన్, బందెల పద్మ, మంగెన భూదేవి నాని,బోళ్ళ వెంకటరమణ, చాగంటి స్వామి, అడబాల యుగంధర్, మొల్లేటి శ్రీనివాస్, ముప్పర్తి నాని,అడబాల రమాదేవి,చెల్లుబోయిన హేలిన హరికృష్ణ, చెల్లింగి అబ్బులు, అనుచూరి సునీత పూరీషోత్తం, అడబాల సాయి,…
యానాం, మహి న్యూస్, ఫిబ్రవరి 27: స్థానిక పీఎం జవహర్ నవోదయ విద్యాలయంలో ‘విజ్ఞాన జ్యోతి’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యానాం రీజినల్ అడ్మినిస్ట్రేటర్ అంకిత్ కుమార కు విద్యాలయ స్కౌట్ బ్యాండ్ ట్రూప్, సంప్రదాయ ‘పూర్ణకుంభం’తో ఘన స్వాగతం పలికారు. స్కౌట్ అండ్ గైడ్స్ గౌరవ వందనం స్వీకరించిన అనంతరం, ఆయన విద్యాలయ ప్రాంగణంలోని ‘రాజీవ్ స్మృతివనం’లో కొబ్బరి, మామిడి, జామ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి అంకిత్ కుమార్ మాట్లాడుతూ తన స్వీయ అనుభవాలను పంచుకుంటూ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఐఏఎస్ వంటి ఉన్నత స్థాయి పరీక్షలకు తాను ఏ విధంగా సిద్ధమైందీ వివరిస్తూ, కఠిన శ్రమతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలని పేర్కొన్నారు. ఒకవేళ అపజయం ఎదురైనా కుంగిపోకుండా, దానిని విజయానికి పునాదిగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. కేవలం మార్కుల కోసమే కాకుండా, సబ్జెక్టుపై లోతైన అవగాహన…
చిత్తూరు జిల్లా/ బంగారుపాళ్యం, మహి న్యూస్, ఫిబ్రవరి 27 : చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం కీరమంద పంచాయతీ కామాక్షి పురం కి చెందిన సీనియర్ నాయకులు మునిరత్నం కుమారుడుగౌతమ్ కుమారుడు గగన్ సాయిజన్మదిన వేడుకల్లో పాల్గొని పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్ శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గగన్ సాయికి కేక్, నేతిమిఠాయిలు వినిపించారు. కార్యక్రమంలో రాష్ట్ర పాలయకరి విభాగం అధ్యక్షులు ఎం.బి. కుమార్ రాజా, మాజీ కురబ కార్పోరేషన్ డైరెక్టర్ అమర్నాథ్, రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి, మొగిలి సర్పంచ్ మనోహరి చంద్రశేఖర్ రెడ్డి,కీరమంద సర్పంచ్ రాజా,మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగరాజా,త్యాగరాజులు,నరసింహా రెడ్డి,నాయకులు బిస్లరి కుమార్, సాంబయ్య, నరసింహులు,ప్రకాష్ గౌడ్,రోహిత్, తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా/ బంగారుపాళ్యం, మహి న్యూస్, ఫిబ్రవరి 27. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం గుంతూరు పంచాయతీ అదే ఎస్సీ కాలనీకి చెందిన శారద ఇంటిలో ఫిబ్రవరి నెల 7వ తేదీ దొంగతనం జరగడంతో, ఎవరు లేని సమయంలో ఇంటికి సంబంధించిన బీగాలు ఉండగా తెలిసిన వారే ఆ బీగాలతో బీరువాను తెరసి ఆపరేటింగ్ చేసి బీరువాలో ఉన్న 30 గ్రాముల తాళిబొట్టు చైన్ దొంగతనం చేసినట్లు శారద బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు బంగారుపాళ్యం అప్ గ్రేడ్ పోలీస్ స్టేషన్ సిఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు.
తాళ్లరేవు, మహి న్యూస్, ఫిబ్రవరి 27: మండల పరిధిలోని కాపులపాలెంలో వేంచేసియున్న శ్రీ సీతారామస్వామివారి దేవస్థానానికి సంబంధించి యానాం కనకాలపేట గ్రామంలో ఉన్న భూములకు శుక్రవారం వేలం పాట నిర్వహించారు. స్థానిక ఆలయ ప్రాంగణంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కాకినాడ ఉపకమీషనర్ డీఎల్పీ రమేష్ బాబు పర్యవేక్షణలో ఈవో యర్రా వెంకటేశ్వరరావు వేలం పాట నిర్వహించారు. సర్వే నెంబరు 161లో ఉన్న రెండు ప్రతులకుగానూ సుమారు 3 ఎకరాల 72 సెంట్ల ఖాళీ భూమికి లైసెన్స్ హక్కునకు బహిరంగా వేలం పాట నిర్వహించగా తొలిప్రతి రెండు ఎకరాలకు గానూ నెలకు రూ.1.36 లక్షలు చెల్లించేందుకు భూపతిరాజు వెంకట సత్య సాయిరాజు పాట దక్కించుకున్నారు. సుమారు 10 మంది పాల్గొన్న ఈ వేలంపాటలో రెండవ హెచ్చు పాటదారులు మేడిద లక్ష్మీ మంగతాయారు రూ.1.35 లక్షల వరకు పాడారు. దీంతో హెచ్చు పాటదారుడు సాయిరాజుకు అధికారులు పాట ఖరారు చేసారు. కాగా రెండవ ప్రతి…
