చిత్తూరు జిల్లా/ బంగారుపాళ్యం, మహి న్యూస్, ఫిబ్రవరి 15 :
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మొగిలీశ్వర స్వామి ఆలయానికి ఆదివారం శివరాత్రి రోజున శ్రీ కామాక్షి సమేత మొగిలీశ్వర స్వామిని ఉదయం నుండి రాత్రి వరకు సుమారు 40 వేల మంది భక్తులు దర్శించి ఉంటారని ఆలయ అధికారులు తెలిపారు. ఉదయం నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ కామాక్షి సమేత మొగిలీశ్వర స్వామిని సుమారు పదివేల మంది వరకు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

మధ్యాహ్నం నుండి రాత్రి వరకు భక్తులు అధికంగా స్వామివారిని దర్శించుకున్నారు.గర్భిణీలు చిన్నపిల్లలు ఉచిత దర్శనంలో చాలా ఇబ్బందులు పడుతూ, ఉచిత దర్శనానికి గంట నుంచి రెండు గంటల పాటు సమయం పట్టింది.విఐపి దర్శనాలు ఎక్కువ సమయం వారికి కేటాయించడంతో సర్వదర్శనం క్యూలైన్ ₹100 క్యూ లైన్ లో ఉన్న భక్తుల కు ఇబ్బందులు తప్పలేదు.ప్రతి సంవత్సరం భక్తులకు లడ్డు ప్రసాదాలు ఇచ్చి, 2026 ఫిబ్రవరి 15న మహాశివరాత్రి రోజున లడ్డు తీర్థ ప్రసాదాలు ఇవ్వకపోవడంతో భక్తులు స్వామివారి ప్రసాదం అందకపోవడంతో అసంతృప్తి వెల్లబుచ్చారు. భక్తులకు ఆహార పొట్లాలు, భోజన సౌకర్యాలు, వాటర్ ప్యాకెట్లు, నీళ్లు, మజ్జిగ మొదలగునవి ఆలయం వారు అందించడమే కాక, దాతలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు మెరుగైన సేవలు ఆలయ అధికారులు కల్పించారు.

మొగిలిస్వామి వారి దర్శనానికి భక్తులు కు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసు వ్యవస్థ బలంగా పనిచేసింది. పలమనేరు డి.ఎస్.పి డేగల ప్రభాకర్ పర్యవేక్షణలో, బంగారుపాళ్యం సీఐ కత్తి శ్రీనివాసులు ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. స్వామి వారి దర్శనానికి చిత్తూరు ట్రైనీ కలెక్టర్, వారి కుటుంబం, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, పూతలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్, మండల టిడిపి నాయకులు ఆలయ సిబ్బంది దగ్గరుండి స్వామి వారి దర్శనానికి ఏర్పాట్లు చేసి గౌరవ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి వారి తీర్థ ప్రసాదాలు ఆలయ అర్చకులు అందించారు. విద్యుత్ కాంతులతో మొగిలి ఆలయం చుట్టుపక్కల భక్తులకు ఎంతో కనువిందు చేసింది.

