చిత్తూరు జిల్లా/బంగారుపాలెం, మహి న్యూస్, మార్చి 10 :
చిత్తూరు జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా బంగారుపాళ్యం సబ్ – రిజిస్టర్ ఎం యోగానంద్ సోమవారం ఏకగ్రీవంగా నియమితులైనారు. సీనియర్ అసిస్టెంట్ విజయ్ కోశాధికారి గా నియమితులైన శుభ సందర్బంగా బంగారు పాళ్యం డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బుస్సా నాగరాజ గౌడ్ ఆధ్వర్యంలో బంగారు పాళ్యం సబ్ -రిజిస్టార్ కార్యాలయం లో మంగళవారం ఘనంగా పుష్పగుచ్చం అందచేసి శాలువాలు కప్పి సన్మానించడమైనది. ఈకార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పద్మనాభ పిళ్లై,ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్ లాల్, కార్యదర్శి సురేష్, కోశాధికారి సుజాత , సభ్యులు ప్రసాద్,రాజా,చిన్నమ్మ, శివ, స్టాంప్ వెండ
ర్స్ దినేష్, అభిరామ్, ఈశ్వర్, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

