నంద్యాల జిల్లా/బనగానపల్లి మహి న్యూస్ ఫిబ్రవరి 17 :
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రజా సంక్షేమాన్ని మరిచిందని సిపిఐ మండల కార్యదర్శి శివయ్య అన్నారు సోమవారం సిపిఐ కార్యాలయంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ ప్రజలను తీవ్ర నిరాశపరిచింది అన్నారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు నిధులు కేటాయించక పోవడాన్ని చూస్తే ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజా సంక్షేమానికి నీళ్లు వదిలేసినట్లుగా ఉందని వారన్నారు యువతకు నిరుద్యోగ భృతి మహిళలకు 1500 అమలు కాలేదని విమర్శించారు ఒకవైపు గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి వి బి జి రామ్ జి అనే చట్టాన్ని తీసుకొచ్చి ఉద్దేశపూర్వకంగా రాష్ట్రాలపై భారం మోపుతున్న గతంలో 90 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి 10% నిధులు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఉండేవి . కానీ వీ బిజీ రాంజీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 40% కేంద్ర ప్రభుత్వం 60% గా చట్టాన్ని తీసుకొచ్చింది ఇది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాల పైన ఆర్థిక భారం పెంచడమే అయినా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తనట్లు ఈ చట్టం పైన ఏమి మాట్లాడకపోగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ పథకానికి నిధులు కేటాయించకపోవడం కార్మికులకు పొట్టలు కొట్టడమేనని వారన్నారు ప్రమాదవశాత్తు గానో దురదృష్టంగానో ఇంటి యజమాని ని కోల్పోయిన మహిళలకు 60 సంవత్సరాలు నిండిన వృద్ధులు వృద్ధాప్య వితంతు పెన్షన్ల కోసం ఆశలతో ప్రజలు ఎదురుచూస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ 4000 పెంచినందుకు అప్పుడు యావత్ ప్రజానీకం అభినందించింది కానీ నూతన పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న మహిళలు వృద్ధులు వికలాంగులు నిరాశపడుతున్నారు కావున రాష్ట్ర ప్రభుత్వం వీటిపై శ్రద్ధ ఉంచి అమలు అయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు సుబ్బారెడ్డి సిపిఐ మండల సమితి సభ్యులు కుల్లాయి స్వామి ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షులు మతేష్ పాల్గొన్నారు

