అమ్మవారి సేవలో భక్తిశ్రద్ధలతో విరాళం సమర్పించిన మచిలీపట్నం వాసి
విజయవాడ, సెప్టెంబర్ 6 (మహి న్యూస్):
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి అన్నదాన విభాగానికి మచిలీపట్నం బ్రహ్మపురానికి చెందిన టీ. తారకరామారావు రూ.1,16,000 విరాళాన్ని భక్తిశ్రద్ధలతో సమర్పించారు.
ఈ విరాళాన్ని ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్, ఆలయ అర్చకుల సమక్షంలో భక్తిపూర్వకంగా అందజేశారు. ఆలయ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన తారకరామారావును ఆలయ అధికారులు అభినందించారు.
0 Comments