పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు మరో మలుపు తిరిగాయి. జోర్డాన్ సరిహద్దుల్లో ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్ల దాడిని తిప్పికొట్టే క్రమంలో ఇద్దరు అమెరికా సైనికులు మరణించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) అధికారికంగా ధ్రువీకరించింది. జులై 17న జరిగిన ఈ దాడిలో మరొక అమెరికా సైనికుడు గల్లంతయ్యాడని, నలుగురు తీవ్రంగా గాయపడ్డారని పెంటగాన్ తెలిపింది. ఈ తాజా మరణాలతో ఈ యుద్ధంలో ఇప్పటివరకు చనిపోయిన అమెరికా సైనికుల సంఖ్య 16కు చేరగా, 430 మందికి పైగా గాయపడ్డారు.
ఈ పరిణామాల మధ్య, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. "అమెరికా శత్రువు యుద్ధాన్ని ప్రేరేపిస్తూ, దాని పర్యవసానాలను ఎదుర్కొంటోంది. ఇరాన్ దేశం , దాని మద్దతు దళాలు (యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్) అమెరికాకు మరచిపోలేని పాఠాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయి" అని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన ఏ ఒప్పందమైనా 'నిరుపయోగం.. చెల్లనిది' అని ఆయన కొట్టిపారేశారు.
News that matters, as it happens
Friday, 11 September 2026
mahinewsindia.com
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం.. ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికుల మృతి!
అమెరికాకు "మరచిపోలేని పాఠాలు" చెప్తామన్న మొజ్తబా ఖమేనీ
📰
Official Article Source Link
https://mahinewsindia.com/post/21