కడప జిల్లా/జమ్మలమడుగు, జూలై 19 (మహి న్యూస్): జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని ఎండీఓ కార్యాలయం సమీపంలో, మార్కెట్ స్కూల్ వద్ద ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలురు, బాలికల వసతిగృహాల్లో విద్యార్థులకు మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి అవసరమైన సామగ్రిని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు, దుప్పట్లు, టవల్లు, ట్రంకు పెట్టెలను అందజేశారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సామగ్రిని పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వసతిగృహాల విద్యార్థినులు, విద్యార్థులు పాల్గొన్నారు.
0 Comments