News that matters, as it happens
Friday, 11 September 2026
mahinewsindia.com
లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, ప్యానెల్ న్యాయవాదుల విధులపై సమీక్షా సమావేశం
కడప (మహి న్యూస్ న్యాయ విభాగం)జూలై 25
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ (అమరావతి) ఆదేశాల మేరకు, కడప జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్-కం-జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని సూచనలతో శనివారం కడప కోర్టు కాంపౌండ్లోని న్యాయ సేవా సదన్ నందు ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
మొదటి అదనపు జిల్లా జడ్జి శ్రీమతి ఎన్. శాంతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి-కం-సీనియర్ సివిల్ జడ్జి శ్రీ ఎస్. బాబా ఫక్రుద్దీన్ పాల్గొన్నారు. "లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మరియు ప్యానెల్ లాయర్స్ విధులు" అనే అంశంపై ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.
ప్రధాన ముఖ్యాంశాలు:
* కేసుల పరిశీలన: ప్యానెల్ లాయర్లు, డిఫెన్స్ కౌన్సిల్స్ పర్యవేక్షిస్తున్న కేసుల ప్రస్తుత పురోగతిని, వాటి త్వరితగత పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను క్షుణ్ణంగా పరిశీలించారు.
* ఉచిత చట్టపరమైన సలహాలు: పేదలకు, బాధితులకు సకాలంలో నాణ్యమైన ఉచిత న్యాయ సలహాలు అందేలా చూడాలని స్పష్టం చేశారు.
* జైలు సందర్శనలు: క్రమం తప్పకుండా జైలు సందర్శనలు (జైలు విజిట్స్ ) చేస్తూ రిమాండ్, శిక్ష అనుభవిస్తున్న ఖైదీల సమస్యలను తెలుసుకుని వారికి తగిన న్యాయ సహాయం అందించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు, ప్యానెల్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
📰
Official Article Source Link
https://mahinewsindia.com/post/38
0 Comments