Tuesday, 28 July 2026
News that matters, as it happens
Header-2
BREAKING

లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, ప్యానెల్ న్యాయవాదుల విధులపై సమీక్షా సమావేశం

కడప (మహి న్యూస్ న్యాయ విభాగం)జూలై 25 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ (అమరావతి) ఆదేశాల మేరకు, కడప జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్-కం-జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని సూచనలతో శనివారం కడప కోర్టు కాంపౌండ్‌లోని న్యాయ సేవా సదన్ నందు ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. మొదటి అదనపు జిల్లా జడ్జి శ్రీమతి ఎన్. శాంతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి-కం-సీనియర్ సివిల్ జడ్జి శ్రీ ఎస్. బాబా ఫక్రుద్దీన్ పాల్గొన్నారు. "లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మరియు ప్యానెల్ లాయర్స్ విధులు" అనే అంశంపై ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ప్రధాన ముఖ్యాంశాలు: * కేసుల పరిశీలన: ప్యానెల్ లాయర్లు, డిఫెన్స్ కౌన్సిల్స్ పర్యవేక్షిస్తున్న కేసుల ప్రస్తుత పురోగతిని, వాటి త్వరితగత పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. * ఉచిత చట్టపరమైన సలహాలు: పేదలకు, బాధితులకు సకాలంలో నాణ్యమైన ఉచిత న్యాయ సలహాలు అందేలా చూడాలని స్పష్టం చేశారు. * జైలు సందర్శనలు: క్రమం తప్పకుండా జైలు సందర్శనలు (జైలు విజిట్స్ ) చేస్తూ రిమాండ్, శిక్ష అనుభవిస్తున్న ఖైదీల సమస్యలను తెలుసుకుని వారికి తగిన న్యాయ సహాయం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు, ప్యానెల్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Leave a Comment

Related Stories

Home
Section
More
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram 🪺 Follow X