Author: admin

ఐ. పోలవరం,మహి న్యూస్, ఫిబ్రవరి 27. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల్లో తుంగలో తొక్కిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సిబ్బంది నిర్వాకం….. కేవలం ఫోటోలు కే పరిమితమైన మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమం…. డిస్టిక్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం ఆధ్వర్యంలో ఐ. పోలవరం ఎంపీడీవో కార్యాలయంలో మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమం కంటి తుడుపుగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సైకియాట్రిక్ సోషల్ వర్కర్, కౌన్సిలర్ చిత్రపు బాబి ఆధ్వర్యంలో మండల స్థాయిలో నిర్వహించి చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ నివారణ , టెలి మానస్ 14416 సేవల ప్రాముఖ్యతను సమగ్రంగా వివరించలేకపోయారు. సమాజంలో బాల బాలికలపై జరిగే లైంగిక దాడులను ఎలా నివారించాలినే విషయాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తీసుకోవలసిన జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఐ పోలవరం మండల విద్యాశాఖ అధికారి వీధి సురేష్ బాబు, కేసనకుర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్…

Read More

తాళ్ళరేవు, మహి న్యూస్,ఫిబ్రవరి 27 : మండల పరిధిలోని పోలేకుర్రు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి నూతన విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం విశేష పూజలు ప్రత్యేక హోమాలు నిర్వహించారు. శనివారం ఉదయం నూతన విగ్రహం ధ్వజస్తంభం ప్రతిష్ట చేయనున్నారు. అనంతరం భారీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆయా కార్యక్రమాలను తిలకించి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా కమిటీ సభ్యులు కోరుతున్నారు.

Read More

విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం సిడిపిఓ మద్దమ్మ కర్నూలు, మహిన్యూస్, ఫిబ్రవరి 27: కర్నూలు జిల్లా ఆస్పరి ప్రాజెక్ట్ పరిధిలోని పనిచేస్తున్న అంగన్ వాడి టీచర్లును వేధిస్తున్నట్లు తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఐ.సి.డి.యస్ సిడిపిఓ మద్ధమ్మ పేర్కొన్నారు.అంగన్వాడి టీచర్లను వేధిస్తున్న ఆస్పరి ఐసిడిఎస్ మద్దమ్మ అనేశీర్షికతో ప్రచురితమైన వార్త అవాస్తమని పేర్కొన్నారు.ప్రాజెక్ట్ పరిధిలోని అన్ని అంగన్ వాడి కేంద్రములు సక్రమంగా పనిచేస్తున్నాయని తెలిపారు.ఇటీవల ఒక అంగన్ వాడి టీచర్ తీవ్ర మానసిక వేదనతో అనారోగ్యం పాలైందని వార్త గురించి ఆమె మాట్లాడుతూ దేవనకొండ మండలం కప్పట్రాల్ల 2 టీచర్ యం.లక్ష్మీదేవి కప్పట్రాళ్ళ గ్రామములో నివసించడం లేదని ఎమ్మిగనూరు మండలం నందు నివసిస్తూ రోజు ఎమ్మిగనూరు నుండి కప్పట్రాల్ల గ్రామమునకు తిరుగుతూ విధులను నిర్వహిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు.సంబంధిత అంగన్వాడి టీచర్ విధుల పట్ల నిర్లక్ష్య వైకరితొ ఉన్నారని, విధులు సరిగ్గా నిర్వహించడం లేదని అనేక మార్లు…

Read More

కర్నూలు, మహిన్యూస్, ఫిబ్రవరి 27: జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయాలు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుమ్మర/శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పీవీబీ సుబ్బయ్య ఆధ్వర్యంలో కర్నూలు శాలివాహన సంఘం నగర అధ్యక్షులు కె వి మధు శాలివాహన కమిటీ సభ్యులు కేసి నాగన్న, సంజీవయ్య,తిరుపతయ్య,కె.వి అశోక్ దాదాపు 100 మంది యువకులు మహిళలు పార్టీలో చేరి సభ్యత్వ తీసుకోవడం జరిగిందన్నారు.వారికి జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింత సురేష్ బాబు జనసేన కండువా కప్పి సాధారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ సామాన్యులకు మధ్యతరగతి వారికి సభ్యత్వం ద్వారా భద్రత కల్పించే ఏకైక పార్టీ జనసేన పార్టీ అని తెలిపారు.జనసేన పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ ఈరోజు అధికారంలో కీలక పాత్ర పోషిస్తున్నారని రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసేందుకు…

Read More

గోకులం షెడ్లతో రైతులకు ప్రయోజనం – తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు సిద్ధవటం/కడప, మహిన్యూస్, పిబ్రవరి 26: సిద్ధవటం మండలం నియోజకవర్గ పార్టీ కార్యాలయం రాజంపేట పట్టణం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల,పశువుల అభివృద్ధి కోసం చేపట్టిన గోకులం షెడ్ల నిర్మాణాల వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం ఉందని నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పేర్కొన్నారు.గురువారం నాడు సిద్ధవటం మండలం, మూలపల్లె గ్రామం నందు పర్యటిస్తూ నూతనంగా నిర్మించిన నాలుగు గోకులం షెడ్లను అధికారులు మరియు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి చమర్తి జగన్ మోహన్ రాజు ప్రారంభించారు.ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం,పాడి పశువుల అభివృద్ధి కోసం రాయితీ కింద గోకులం షెడ్లను,పశుగ్రాసాన్ని కూడా అందిస్తుందని చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు.అదేవిధంగా ఆయన మాట్లాడుతూ పాడి రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర…

Read More

రాజంపేట, మహిన్యూస్, పిబ్రవరి 26: రాజంపేట మున్సిపాలిటీలో తాగునీటి నాణ్యతపై అకస్మాత్ తనిఖీలురాజంపేట పట్టణ ప్రజలకు మున్సిపాలిటీ ద్వారా సరఫరా అవుతున్న తాగునీటి నాణ్యతను పరిశీలించేందుకు ఈరోజు మున్సిపల్ కమిషనర్ ఎస్. లక్ష్మీనారాయణ అకస్మాత్ తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా పట్టణంలోని పలు నీటి సరఫరా కేంద్రాలను పరిశీలించి, తాగునీటిలో ఫ్లోరిన్ స్థాయిలను స్వయంగా పరీక్షించారు. పరీక్షల ద్వారా నీరు ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో నిర్ధారించుకున్నారు.అదేవిధంగా వాటర్ సెక్షన్ సిబ్బందికి కమిషనర్ పలు సూచనలు చేశారు. ప్రజలకు ఎప్పటికప్పుడు సకాలంలో శుద్ధమైన తాగునీరు అందించాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ, వేసవికాలంలో నీటి కొరత లేదా నాణ్యత సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.పట్టణ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా తాగునీటి నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, నీటి శుద్ధి ప్రక్రియలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని కమిషనర్ సూచించారు.మున్సిపాలిటీ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తోందని ఈ సందర్భంగా తెలిపారు.

Read More

బద్వేల్/కడప, మహి న్యూస్, పిబ్రవరి 26 : నిహాల్ సోలార్ ఎంటర్ప్రైజెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న, మైదుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పుట్టాసుధాకర్ యాదవ్. టీడీపీ నాయకులు బిజివేముల రామిరెడ్డి ఆహ్వానం మేరకు బద్వేల్ మునిసిపాలిటీ ఆఫీస్ ఎదురుగా నూతనంగా ప్రారింభించిన నిహాల్ సోలార్ ఎంటర్ప్రైజెస్ ను మైదుకూరు ఎమ్మెల్యే పట్టా సుధాకర్ యాదవ్ బద్వేల్ టిడిపి ఇన్చార్జి రితేష్ రెడ్డి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రామిరెడ్డి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ని శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీపీ వీరనారాయణరెడ్డి, బి. మఠం టిడీపి అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి, జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు కానాల మల్లికార్జున రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ యల్లటూరి సాంబశివరెడ్డి, మిల్లు శీను, వైట్ సుబ్బారెడ్డి, వేల్పుల భాస్కర్ యాదవ్, పూజ శివ యాదవ్, సుధాకర్, గంగరాజు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తదితరులు…

Read More

‎కడప, మహి న్యూస్, ఫిబ్రవరి 26 : ‎ డాక్టర్ సి.యామిని, అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కడప వారు మరియు సెక్రటరీ-కం-సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కడప ఎస్.బాబా ఫక్రుద్దీన్ వారి సూచనల మేరకు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులచే వల్లూరు మడలంలోని ఏ.పీ మోడల్, కస్తూర్బా మరియు జడ్.పి స్కూల్స్ నందు 26.02.2026 వ తేదీన ” నల్సా (ఆశ-అవగాహన, మద్దతు, సహాయం మరియు చర్య) ప్రామాణిక ఆపరేటింగ్ విధానం – బాల్య వివాహాలను నిర్మూలించడానికి, 2025, నల్సా పథకములు మొదలగు అంశాలపై అవగాహన కార్యక్రమం”. నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ హరిబాబు మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించడం.మద్దతు: బాల్య వివాహాల నుండి రక్షించబడిన వారికి…

Read More

కడప, మహి న్యూస్, ఫిబ్రవరి 26 : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం కడప నగరపాలక సంస్థ సంస్థ కమిషనర్(ఎఫ్.ఏ.సి.) గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్. డా. శ్రీధర్ చెరుకూరి ని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసిన కేఎంసి కమిషనర్ రాకేష్ చంద్రం.

Read More

అమలాపురం, మహి న్యూస్, ఫిబ్రవరి 26: ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ కప్-20 పోటీలలో రెండు బంగారు, ఒక రజత పతకాన్ని సాధించిన కారుమూరి లేఖా నీహారికను జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అభినందించారు.న్యూఢిల్లీలోని కే.డీ జాదవ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ కప్-20 పోటీలలో రామచంద్రపురానికి చెందిన కారుమూరి లేఖా నీహారిక ,లైట్ కాంటాక్ట్ విభాగంలో రెండు బంగారు పతకాలను సాధించింది. క్రియేటివ్ ఫామ్ వెపన్ విభాగంలో ఒక రజత పతకాన్ని కైవసం చేసుకుంది.ఈ విజయంతో కోనసీమ జిల్లా ఖ్యాతిని అంతర్జాతీయ వేదికపై చాటింది.బెంగళూరులో నిర్వహించనున్న కేలో ఇండియా సౌత్ జోన్ పోటీలకు ఎంపికైంది.ఈ సందర్భంగా లేఖా నీహారిక జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం అభినందనీయమని భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని జిల్లా కలెక్టర్ ప్రశంసించారు.

Read More