Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: editor
తిరుమల,మహి న్యూస్,మార్చి 1 : భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుర్యకాంత్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన న్యాయమూర్తుల బృందంతో కలిసి ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా మహాద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆలయ అర్చకులతో కలిసి మేళతాళాల నడుమ, వేద మంత్రోచ్ఛారణతో సాంప్రదాయబద్ధంగా ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం టీటీడీ చైర్మన్, ఈవోలు స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి శ్రీ వరాహస్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సీవీ&ఎస్వో మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
✅ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి: పిల్లల చదువుల కోసం ₹1 లక్ష వరకు పావలా వడ్డీకే రుణం! ð✅ ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి: కుమార్తె పెళ్లికి 48 గంటల్లోనే ఆర్థిక సాయం! ð✅ ఉచిత స్మార్ట్ఫోన్లు: యానిమేటర్లకు ₹15,000 విలువైన ఫోన్లు ఉచితం! ð±
రాష్ట్రంలోని దివ్యాంగులకు (PwDs) APSRTC బస్సుల్లో 100% ఉచిత ప్రయాణం కల్పిస్తూ ప్రభుత్వం G.O.MS.No.21 విడుదల చేసింది! ✅ ð¹ ముఖ్య అంశాలు:
సిమ్ ఉన్న ఫోన్లోనే WhatsApp – కొత్త నిబంధనలు అమల్లోకి ☛ ఏ ఫోన్లో సిమ్ రిజిస్టర్ అయి ఉంటుందో ఆ ఫోన్లో మాత్రమే WhatsApp పనిచేస్తుంది ☛ ఈ నిబంధన WhatsApp మాత్రమే కాదు…Telegram, Signal, Snapchat, ShareChat, JioChat, Arattai, Josh వంటి అన్ని Messaging Apps కు వర్తిస్తుంది ☛ మార్చి 1 నుంచి కొత్త నిబంధన అమలు ☛ ఫోన్ నుంచి సిమ్ తీసినా / Swap చేసినా / Deactivate చేసినా Apps పనిచేయవు ☛ మళ్లీ Original SIM పెట్టి Authentication చేసిన తరువాతే Apps పని చేస్తాయి ☛ WhatsApp Web / Telegram Web కూడా ప్రతి 6 గంటలకు Auto Logout అవుతాయి ☛ మళ్లీ Login కావాలంటే SIM ఉన్న ఫోన్తో QR Code Scan చేయాలి ☛ Cyber Crimes, SIM Swapping Scams నియంత్రించడానికి…
మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి జిల్లా,డివిజన్,మండల కేంద్రాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహణ ప్రతి సోమవారం ఉదయం 9.30 నుంచి ఉ.10 గంటల వరకు డయల్ యువర్ కలెక్టర్ ఫోన్ చేయవలసిన ల్యాండ్ లైన్ నెం.08562-244437 : జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి : డి ఆర్ ఓ విశ్వేశ్వర నాయుడు వై ఎస్ ఆర్ కడప,మహి న్యూస్ ఫిబ్రవరి 15 : ” *ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS)” అర్జీల స్వీకరణ కార్య క్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాలలో కూడా సమర్పించుకోవచ్చునన్నారు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం: డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9.30 నుండి 10 గంటల వరకు జరుగుతుందన్నారు.ప్రజలు 08562-244437 ల్యాండ్…
అనంతపురం ,మహి న్యూస్ ఫిబ్రవరి 15 : అనంతపురంలో జన్మించిన బంజారా జాతి ముద్దుబిడ్డ, గొప్ప హేతువాది సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతోత్సవం ముంబై లంబాడిలు ఘనంగా జర్పారు. ఆదివారం కంజూర్ మార్గ్- బాండుప్ బంజారా సేవా సంఘం, గోర్ సేన శిక్ వాడి, 11తండేవాసిలు గత 7ఏళ్ల నుంచి అనవహితీగా వేడుకలు నిర్వహిస్తున్నారు. వీరు రంగారెడ్డి, వికారాబాద్, ఉమ్మడి మెహబూబ్ నగర్ జిల్లాలకు చెందినవారు ఇక్కడ నివాసమై ఉన్నారు. మొదట్లో అంబేడ్కర్ చౌక్ నుంచి గుడి మండపం వరకు తమదైన లంబాడి అంగరంగ వేశాధారణలలో భారీ ర్యాలీ నిర్వహించారు. తదుపరి బహిరంగ సభ ఏర్పాటైది. అందులో స్థానిక ఎమ్మెల్యే సునీల్ బావు రాహుత్, కౌన్సిలర్స్ దీపక్ సావంత్, శ్వేతతాయి పావస్కర్, శాంతిలాల్ బోర్డే తదితర రాజకీయ నాయకులు పాల్గొని తమ జాతి ప్రజలకు అన్ని వెళ్లాలో చేదోడు వాదోడుగా ఉంటామని హామీచ్చారు. ఇటీవల ఎంబిబిఎస్ పాసైన వరుణ్ రనావత్…
డోన్, మహి న్యూస్ ఫిబ్రవరి 15:- మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నంద్యాల జిల్లా డోన్ పట్టణం కొండపేటకు చెందిన దస్తగిరి (65) తన భక్తిని విశేషంగా చాటుకున్నారు. ఆంజనేయ స్వామి కొండపై ఉన్న దేవాలయానికి 20 లీటర్ల నీటి బిందెను స్వయంగా భుజాన మోసుకుంటూ కొండపైకి చేరుకున్నారు. అనంతరం ఆ నీటితో గడస్తంభానికి, స్వామివారికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దస్తగిరి మాట్లాడుతూ, డోన్ ప్రాంత ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆయన వయస్సును లెక్కచేయకుండా చూపిన భక్తి, నిబద్ధత స్థానికులను ఆకట్టుకుంది. భక్తి భావంతో కొండపైకి నీరు మోసుకెళ్లి పూజలు నిర్వహించడం పట్ల స్థానికులు దస్తగిరిని అభినందించారు.
సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్తో కీలక అంశాలపై గేట్స్ చర్చలు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో సహకారంపై ప్రధానంగా దృష్టి ఆర్టీజీఎస్ కేంద్రం, ఉండవల్లి పొలాలను సందర్శించనున్న బిల్ గేట్స్ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో సంజీవని ప్రాజెక్టును విస్తరించనున్న ప్రభుత్వం మహి న్యూస్ ఫిబ్రవరి 15 : మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపక అధినేత బిల్ గేట్స్ సోమవారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కీలక రంగాల్లో భాగస్వామ్యంపై చర్చించేందుకు ఆయన తన బృందంతో కలిసి ఏపీకి వస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్లతో సమావేశమవుతారు. ఆదివారం అందిన సమాచారం ప్రకారం, సోమవారం ఉదయం 10 గంటలకు బిల్ గేట్స్ సచివాలయానికి చేరుకుంటారు. ముందుగా రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కేంద్రాన్ని సందర్శించి, పాలనలో సాంకేతికత వినియోగాన్ని పరిశీలిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రులు,…
డోన్ మహి న్యూస్ ఫిబ్రవరి 15 ప్రముఖ శాస్త్రవేత్త శ్రీ గెలీలియో గారి జయంతి సందర్బంగాడోన్ పట్టణం లో సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో ప్రముఖ శాస్ర్తవేత్త శ్రీ గెలీలియో గారి జయంతి సందర్బంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించారు వారిని స్మరించుకున్నారు.ఈ సందర్బంగా సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి మాట్లాడుతూమన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి కోరారుశ్రీ గెలీలియో గారు ఫిబ్రవరి 15 – 1565 ఇటలీ లోని పిసా నగరం లో జన్మించారు. ఈయన ఇటలీకు చెందిన భౌతిక శాస్త్రవేత్త,గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు మరియు తత్వవేత్త.టెలీస్కోపు(దూరదర్శిని) ను వాడుకలోకి తెచ్చాడు.చిన్న వయసులో తండ్రి వద్దనే విద్యాభ్యాసం చేశాడు. తరువాత పీసా విశ్వవిద్యాలయంలో వైద్య విద్యార్థిగా…
మహానంది,మహి న్యూస్ ఫిబ్రవరి 15, మహానంది పుణ్య క్షేత్రంలో నూతనంగా సూట్ రూము నిర్మాణంకు 15 లక్షలు ఇవ్వడాని ముందుకు వచ్చిన దాత. ఆదివారం ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు సందర్భంగా దైవ దర్శనం విచేసిన హైదరాబాద్ వాస్తవ్యులు యలమంచి సాంబశివరావు, సుజాత, నవీన్, నాగిని దంపతులు సూట్ రూము నిర్మాణంకు 15 లక్షలు ఇవ్వడాని ముందుకు వచ్చారు. ముందుగా రూ. 1 లక్ష అడ్వాన్సుగా ఈఓ కు అందజేశారు. అనంతరం వేదపండితులు వేద ఆశీర్వచనాలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు
